లాక్డౌన్లో ఇబ్బందులు లేకుండా 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తూ.. విద్యుత్ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. విద్యుత్ బిల్లులను ఆన్లైన్లోనే చెల్లించాలని కోరారు. కరెంట్ సరఫరాలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని.. ఆపరేటర్ నుంచి సీఎండీ వరకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారని చెప్పారు.
'వినియోగదారులు విద్యుత్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించాలి. లాక్డౌన్ కారణంగా కరెంట్ రీడింగ్ తీయలేకపోతున్నాం. గత మార్చిలో వచ్చిన బిల్లులనే తీసుకోవాలని ఈఆర్సీ సూచించింది. ఎండాకాలంలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. వినియోగదారులపై ఒక్కపైసా కూడా అదనంగా భారం మోపం. గతేడాది మార్చి నెలలో వచ్చిన బిల్లు ఆధారంగానే ఇప్పుడు చెల్లించండి. వినియోగదారుల నుంచి ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోమని' మంత్రి వివరించారు.